PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ బి.సి వసతిగృహాన్ని సందర్శించిన డిఆర్ఓ

1 min read

– హాస్టల్ లో రాత్రి బస, సౌకర్యాలపై ఆరా..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  స్ధానిక ప్రభుత్వ బి.సి. వసతి గృహాన్ని జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  హాస్టల్ లో ఉన్న సౌకర్యాలను, టాయిలెట్ల స్ధితిగతులను ఆయన పరిశీలించారు.  ఆహారం నాణ్యతను పరిశీలించి విద్యార్ధులతోపాటు సహపంక్తి భోజనం చేశారు.  విద్యార్ధులతో డిఆర్వో ఎవిఎన్ఎస్ మూర్తి ముఖా ముఖిగా సమావేశమై వారికి అందుతున్న విద్యాభోదన ఆంశాలను అడిగి తెలుసుకున్నారు.  విద్యార్ధులతో కలిసి భోజనం చేసి వారితోపాటు నిద్రచేశారు.  శనివారం ఉదయం విద్యార్ధులతోపాటు ఉదయంపూట ప్రార్ధనా కార్యక్రమంలో డిఆర్వో పాల్గొన్నారు.  ఇటువంటి క్షేత్ర పర్యటనలతో హాస్టల్స్  నిర్వహణలో స్ధితిగతులను తెలుసుకొని వాటిని మెరుగుపర్చేందుకు ఎంతో దోహదపడతాయన్నారు.

About Author