PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో పర్యటించిన కేంద్ర కమిటీ కరువు బృందం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో కరువు పరిస్థితులు పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కరువు బృందం పత్తికొండ లోని వివిధ గ్రామాల్లో పర్యటించింది. ఈ మేరకు పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి, జూటూరు గ్రామాల్లోని సమీప పొలాలు పరిశీలించింది. కరువు పరిస్థితులపై రైతులతో పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర కమిటీ బృందం సభ్యులతో స్థానిక  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కలిసి వారితోపాటు పర్యటించారు. పత్తికొండ నియోజకవర్గం లో ఈ సంవత్సరం ఏర్పడిన కరువు పరిస్థితులను, వారికి వివరించారు. పత్తికొండ మండలంలోని చిన్నహుల్తి గ్రామ సమీపంలో పొలాలు పరిశీలించి రైతులతో పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు కేంద్ర కమిటీ బృందం సభ్యులతో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కలిసి పర్యటించారు. కరువు పరిస్థితులను, పర్యవసానాలను వివరించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఏర్పడిన కరువు పరిస్థితులు రైతంగం తీవ్ర నష్టాలను సరిచూస్తుందని కరువు బృందంతో ఎమ్మెల్యే చెప్పారు. పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాక రైతులు అప్పుల పాలు అవుతున్నారు. ఖరీఫ్ తో పాటు, రవి సీజన్లో కూడా వర్షాలు రాక పంటలు పూర్తిగా ఎండిపోయాయని పరువు బృందానికి ఎమ్మెల్యే వివరించారు. కావున తక్షణమే ఈ ప్రాంతంలో కరువు సహాయక చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందానికి సూచించారు. సైతం వారికి వివరించారు.

About Author