NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రంకెన్ డ్రైవ్ … ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు

1 min read

తనిఖీలు చేపట్టిన … కర్నూల్ మూడవ పట్టణ పోలీసులు.

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ అది రాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ మూడవ పట్టణ పోలీసులు  మంగళవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఇద్దరు పట్టుబడ్డారు.   కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచారు.  కర్నూలు జెఎఫ్ సి ఎం కోర్టు వారు  ఒక్కొక్కరి పై రూ. 10 వేల జరిమానా విధించారు. బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన 6 మంది పై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు.  కర్నూలు జె ఎఫ్ సి ఎం కోర్టు వారు ఒక్కొక్కరిపై రూ. 1000 జరిమానా విధించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *