PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంట నిర్వాహకులపై డిఎస్పీ విచారణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు డిఎస్పీ ఏ శ్రీనివాసరావు వంట నిర్వాహకులపై విచారణ చేపట్టారు.గతంలో మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా పనిచేస్తున్న వారి మిడుతూరు స్టేట్ బ్యాంకులో నుండి మాకు తెలియకుండానే నగదు డ్రా చేశారని గతంలోనే వంట నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీస్ స్టేషన్ లో వంట నివాహకులను  అదేవిధంగా బ్యాంకు సిబ్బందిని పిలిపించి వారిని డిఎస్పీ విచారించారు.తర్వాత ఎన్నికల కోడ్ వచ్చినందున గ్రామాల్లో ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గొడవలకు తావు లేకుండా చూడాలని సమస్యాత్మక పోలీస్ సిబ్బంది గ్రామాలపై దృష్టి సారించాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులను గౌరవించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని డి.ఎస్.పి పోలీస్ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎం జగన్ మోహన్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.

About Author