PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులతో కలిసి.. భోజనం చేసిన డ్వామా పీడీ..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా తిమ్మాపురం మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో డ్వామా పీడీ బి. అమర్నాథ్​ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు విద్యార్థులందరికీ అన్నం వడ్డించారు.  ఏపీ సీఎం కప్​ ప్రొగ్రాంలో భాగంగా డ్వామా పీడీ అమర్నాథ్​ రెడ్డి సిబ్బందితో కలిసి జిల్లా పరిషత్​ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజనం మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వంటశాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కాంపౌండ్​ వాల్​లో పిచ్చి మొక్కలు తొలగించి.. శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫుట్​బాల్​ ఆడారు. కార్యక్రమంలో డ్వామా సిబ్బంది, జిల్లా పరిషత్​ పాఠశాల సిబ్బంది ఉన్నారు.

About Author