PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్లాంటేషన్​ను పరిశీలించిన డ్వామా పీడీ

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: జిల్లాలోని దేవనకొండ మండలం మాచాపురం గ్రామ పరిధిలో రైతులు నిర్వహిస్తోన్న అవెన్యూ ప్లాంటేషన్​ ప్రక్రియను గురువారం డ్వామా పీడీ(మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం) అమర్నాథ్​రెడ్డి పరిశీలించారు. ఈమేరకు ప్లాంటేషన్ నిర్వహనలో ఫెన్సింగ్​, వాటరింగ్​ విధానంపై ఆరా తీశారు. స్వీట్ ఆరంజ్​ మొక్కలు నాటుతోన్న రైతులతో మాట్లాడారు. రైతుల ప్లాంటేషన్​ వివరాలను ఎంసీసీ రిజిస్టర్​లో నమోదు చేయాలని ఏపీవో ఈసీఎస్​లకు సూచించారు. కార్యక్రమంలో రైతులు, ఎన్​ఆర్​ఈజీఎస్​ సిబ్బంది పాల్గొన్నారు.

About Author