PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్ణాట‌క‌లో భూకంపం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, సూళియ తాలూకాలో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందుగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత దాదాపు 45 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇళ్ళలోని అరమరలలో పెట్టిన వస్తువులు క్రిందకు పడిపోయాయని చెప్పారు. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర మాట్లాడుతూ, సూళియ తాలూకా ప్రజలు తనకు ఫోన్లు చేశారని చెప్పారు. శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించిందని చెప్పారన్నారు. భూకంపం గురించి కర్ణాటక విపత్తు నిర్వహణ కేంద్రం ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. భూకంప కేంద్రం, తీవ్రత వంటి వివరాలను ఈ కేంద్రం ధ్రువీకరించవలసి ఉందని తెలిపారు.

                                  

About Author