PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీపీఎం జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా మూడోసారి ఏచూరి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తున్న సీపీఎం 23వ కాంగ్రెస్ సదస్సులో ఆదివారం పార్టీ పొలిట్‌బ్యూరోను ఎన్నుకున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో పొలిట్‌బ్యూరోను పార్టీ ఎన్నుకుంది. ఈ ఎన్నికలో పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత రామ్ చంద్ర డోమ్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. దళిత నేతకు ఈ పదవి దక్కడం పార్టీలో ఇదే తొలిసారి. పార్టీ పదవుల కోసం గరిష్ట వయసు 75గా నిర్ణయించడంతో కొందరు సీనియర్లు పోటీ చేయలేదు.

                                           

About Author