PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయి…

1 min read

– గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికిన స్థానిక వార్డు నాయకులు

ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జగనన్నతోనే సాధ్యం

జగనన్న చెప్పాడు అంటే చేస్తాడు అంటే

పేదరికం తీర్చేందుకే సంక్షేమ పథకాలు

పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చిన జగనన్న

రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీ గడప వద్దకు రాలేదు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి మీ సమస్యలను,తెలుసుకునేందు కే వచ్చాను

–కర్నూల్ నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గురువారం సాయంత్రం కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 52వ వార్డ్ 132వ సచివాలయం పరిధిలో ఉన్న సాయిబాబా నగర్ వీధుల్లో నిర్వహించారు. పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  అన్నారు. స్థానిక 52వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.విధిలో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో 52వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు కార్పొరేటర్ శేఖమద్ ,సర్దార్ మహేష్ ,రమణ , ఈబ్రు ,ముని స్వామి ,సుబ్బు , హనోక్ , చిన్ని , సిద్దయ్యా , గుణ శేఖర్ , నరేష్ గుణ , రియాజ్ , రిజవాన్, నాజిమా బేగం ,బాల శివ , ఫ్రూట్ చిన్న ,హరి , నాయబ్ ,ఫయాజ్ ,సోమశేఖర్ , అశోక్ పార్టీ ముఖ్యనాయకులు, వార్డ్ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author