PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టంబ‌ర్ లో ఎడ్ సెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్‌సెట్‌-2021 కు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేర‌కు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల రెగ్యులర్‌ కోర్సుకు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17వ తేదీ వరకు , అపరాధ రుసుంతో ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సెప్టెంబరు 21వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ నిర్వహించనున్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు www.sche.ap.gov.in/edcet ను సంప్రదించాల‌ని విజ్ఞప్తి చేశారు.

About Author