NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యతోనే ..ఉత్తమ భవిష్యత్​..

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: విద్యతోనే బంగారు భవిష్యత్​ సాధ్యమవుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో బాలికలకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆస్పరి శ్రీనివాసులు మాట్లాడుతూ బాలికలు ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నేటి సమాజంలో బాలికల పైన హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మునిస్వామి, చిన్న రంగన్న, కళాశాల అధ్యాపకులు పెద్దయ్య, లాల్ స్వామి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author