PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింల అభ్యున్నతికి కృషి

1 min read

– మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్ నగర్: హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక రంజాన్​ పండుగ అని పేర్కొన్నారు..రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. గురువారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్​ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ వెంకటరావు, సిబ్బంది ఉన్నారు.

About Author