PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘హార్టికల్చర్​’ అభివృద్ధికి కృషి: జేసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లాలో హార్టికల్చర్​ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు జాయింట్​ కలెక్టర్​ (డెవలప్​మెంట్​) మనజీర్ జిలాని సమూన్​. మంగళవారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గిరిగేట్ల గ్రామంలో రైతులు సాగు చేసిన జామ, మామిడి, స్వీట్​ ఆరంజ్​, డ్రాగన్​ ఫ్రూట్స్​ తదితర మొక్కలను జేసీతో పాటు డ్వామా పీడీ అమర్నాథ్​ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా జేసీ జిలానీ సమూన్​ మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే అవకాశం.. పండ్లు, పూలమొక్కల పెంపకంతో సాధ్యమన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు వాటర్​ సరఫరా చేయడంతోపాటు వాటిని సంరక్షించుకోవాలన్నారు. అనంతరం డ్వామా పీడీ అమర్నాథ్​ రెడ్డి రైతులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో తుగ్గలి మండలం ఎంపీడీఓ, ఎమ్మార్వో, ఏపీడీ, అంబుడ్స్​మెన్​, ఈజీఎస్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author