PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది ఆలయ అభివృద్ధికి కృషి : ఈఓ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు ఆలయ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్​. మంగళవారం దేవస్థానంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయంలో సేవలు అందిస్తున్నామని, స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రంలో అన్నదానం, ప్రసాద వితరణకు భక్తులు విరివిగా విరాళాలు అందజేయాలని ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్​ కోరారు.

About Author