NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు: ఆసుపత్రిలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఎంపిపి లాలం రమేష్ తెలిపారు. వెలుగోడు మండలం లోని వేల్పనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో జరుగుతున్న జాతీయ కార్యక్రమాలు, ఆసుపత్రిలో ప్రసవాలు మరియు ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు గురించి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు తగిన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిని ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి విడుదలైన నిధుల నుంచి ఖర్చు చేయడానికి తీర్మానించడమైనది. ఈ సమావేశంలోవైస్ ఎంపీపీ శంకర్ నాయక్ , వేల్పనూరు గ్రామ సర్పంచ్ సర్దార్ మియా వేల్పనూరు 2 ఎంపిటిసి వెంకటరామిరెడ్డి , ఆరోగ్య సూపర్ వైజర్ శ్రీనివాసులు , ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author