NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురువ సంఘం బలోపేతానికి కృషి : జిల్లా అధ్యక్షులు దేవేంద్రప్ప

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కురువ సంఘం బలోపేతానికి, డాక్టర్ పుల్లన్న ఆశయసాధనకు కృషి చేస్తామని  కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు ఎం .దేవేంద్రప్ప  అన్నారు. శుక్రవారం  స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో లక్షలాది ఓటు  బ్యాంక్ కలిగిన కురువలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తూ వున్నారని విమర్శించారు. రాబోయే అన్ని ఎన్నికల్లో తమ కులానికి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలకే మద్దతుగా వుంటామని స్పష్టం చేశారు. త్వరలో లక్షలాది మంది తో కురువ గర్జన (బహిరంగ సభ) నిర్వహించి తమ ఐక్యతను చాటుతామన్నారు. కురవల  ఓటు  బ్యాంక్ దామాషాన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు విశ్రాంత తహసీల్దార్ కే .కిష్టన్న , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి, నగర అధ్యక్షులు తవుడు  శ్రీనివాసులు, జిల్లా నాయకులు బి .సి .తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.

About Author