PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌ల సంఘం అధికారులు ఈవీఎం ట్యాంప‌రింగ్ చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఎన్నికల సంఘం అధికారులు కొందరు ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు అఖిలేష్ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అఖిలేష్ ఈ ఆరోపణలు చేయడం మరింత ఆసక్తి రేపుతున్నాయి. వాస్తవానికి ఈసారి కూడా అధికారంలోకి రాదని ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో అఖిలేష్ ఆరోప‌ణ‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

                                              

About Author