PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడిగా బి.సురేష్ కుమార్ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్: జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షులుగా కర్నూల్ జిల్లా కు చెందిన బి. సురేష్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది. ఆదివారం విజయవాడ నాగార్జున హాస్పిటల్ నందు జరిగిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నికల్లో ఎన్నుకున్నారు.  అధ్యక్షుడిగా పోటీ చేసిన సురేష్ కుమార్( కర్నూలు), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా యస్. గోపాల్ నాయక్(అనంతపూర్) రాష్ట్ర కోశాధికారి గా పి సనావుల్లా(కడప) లు గెలుపొందారు.   రాబోవు రెండు సంవత్సరాలకు ఈ కమిటీ ఆధ్వర్యంలో జన విజ్ఞాన  వేదిక ,విద్య,విజ్ఞాన, చైతన్య  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వి.బ్రహ్మా రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు జంపా క్రిష్ణా కిషోర్, జాతీయ నాయకుల టి.వి.రావ్ మరియు అన్ని జిల్లా ల నుండి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author