PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు జిల్లా  పత్తికొండ బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీ ఎంపిక చేసినట్లు బార్ అసోసియేషన్ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మై రాముడు బుధవారం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు మార్నేని మల్లికార్జున బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా బి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి గా సూరజ్ ట్రెజరర్ గా భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కి పోటీ జరగ్గా కాశీ విశ్వనాథ్ 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

About Author