PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నూతన స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకున్నారు. స్టాండింగ్ సభ్యుల వివరాలను జడ్పి చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి వెల్లడించారు. జిల్లా స్టాండింగ్ కమిటీ  స్థాయి సంఘాలలలో నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో మిడుతూర్ జడ్పీటీసీ  పర్వత యుగంధర్ రెడ్డి  ఆర్థిక కార్యకలాపాలు మరియు ప్రణాళిక సభ్యులు గా, ప్రాంతీయ అభివృద్ధి మరియు ఉపాధి హామీ పథకం  సభ్యులుగా కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యులు  సోమల సుధాకర్ రెడ్డి , నందికొట్కూరు జడ్పీటీసీ  షైక్  కరిమున్నీసా  సోషల్ వెల్ఫేర్ సభ్యులుగా , జూపాడుబంగ్లా మండలం జడ్పీటీసీ  పోచా జగదీశ్వర్ రెడ్డి  అభివృద్ధి పనుల సభ్యులు గా, పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య జిల్లా మహిళా సంక్షేమ మరియు రక్షణ స్థాయి సంఘం చైర్మన్ గా  ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ స్టాండింగ్ స్థాయి సంఘాల లో నందికొట్కూరు నియోజకవర్గానికి పెద్దపీట వేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కి, రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ  సందర్భంగా  బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి యువసేన తరుపున సభ్యులకు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి, కౌన్సిలరు లు చిన్న రాజు,చాంద్ బాష, లాల్ ప్రసాద్, అశోక్ , రావుప్,   ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు బొల్లెద్దుల రామకృష్ణ, రమేష్ , ఉస్మాన్ బేగ్, శ్రీకాంత్, లు హర్షం వ్యక్తం చేసి

About Author