PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిసివై పార్టీ అధినేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎల్లార్తి అర్జున్ వాల్మీకి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : 2024 సంవత్సరం జనవరి మొదటి రోజున బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వగృహం పుంగనూరు లో కలిసి ఆయనకు వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ & టీమ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరడంమైనది. అందుకు రామచంద్ర యాదవ్  స్పందిస్తూ జనవరి మొదటి వారంలో నియోజకవర్గం వారిగా తుది జాబీతా పేర్లను ఖరారు చేస్తామనీ సానుకూలంగా స్పందించారు. అదే విధంగా అర్జున్ మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ఆలూరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను పెట్టి ఆలూరు నియోజకవర్గంలో వున్న వేలాది మందిని పార్టీలో చేర్పించడానికి నేను కృషి చేస్తాననీ రామచంద్ర యాదవ్ కి తెలియజేయడం జరిగింది. ఈ విషయాల పై బిసివై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్  స్పందిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో యువతకు పెద్ద పీఠం వేస్తాననీ యువతకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడానికై మా బిసివై పార్టీ పనిచేస్తుందని మరియు రాష్ట్రంలో వున్న రైతులందరి కష్టాలను తీర్చెందుకు మన బిసివై పార్టీ ఎల్లప్పుడూ తోడుగా వుంటుందని తెలిజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం యువత,పుట్టపర్తి యువత మరియు ఇతర యువనాయకులు పాల్గొనడం జరిగింది.

About Author