NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి

1 min read

– BJYM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బైరెడ్డి శబరి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆవు అంటే పాలిచ్చే తల్లి లాంటిదని అలాంటి ఆవుపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వెంటనే ఎమ్మెల్యే ను బర్తరఫ్ చేయాలని BJYM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు బుదవారం కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ భారతదేశంలో హిందువులు అందరూ గోవును లక్ష్మీదేవిలా పూజిస్తామని, అలాంటి గో మాత పై అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారిణికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి వినుషా రెడ్డి, BJYM జిల్లా అధ్యక్షులు తలారి సుధాకర్, బైరెడ్డి దినేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


About Author