PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల ఉద్యమం.. ఉధృతం..

1 min read
  • పీఆర్సీ జీఓలను రద్దు చేయాలని డిమాండ్​
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం…

పల్లెవెలుగువెబ్, కర్నూలు : ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో .. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సోమవారం సమ్మె నోటీసు ఇచ్చిన  విషయం తెలిసిందే. మంగళవారం  అన్ని ఉద్యోగ సంఘాలు  పీఆర్సీ సాధన సమితి ద్వారా భారీ ర్యాలీ, నిరసన తెలిపారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్​ కార్యాలయం నుంచి  ర్యాలీగా బయలుదేరి… కలెక్టరేట్​ వరకు వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మోసం చేసిందని, తమకు నష్టం కలిగించే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

About Author