PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయితీపై ఆర్యవైశ్యులకు ఉపాధి యంత్రాలు

1 min read

అనాధ ఆర్యవైశ్య విద్యార్థులకు ఉచిత విద్య.

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు మండల పరిధిలోని ఆర్యవైశ్యుల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, గ్రైండర్లు, చిన్నపాటి యంత్రాలను దరఖాస్తు చేసుకున్న వారందరికీ రాయితీపై ఇవ్వడం జరుగుతుందని మండల ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు వెంకట సత్యనారాయణ, లాలం నాగార్జున మండల అధ్యక్షులు బచ్చు రాములు తెలిపారు. ఉపాధి కోసం యంత్రాలు కావాల్సినవారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల వారికి తమ దరఖాస్తు సమర్పించాలన్నారు.దరఖాస్తులు చేసుకున్న వారందరికీ వీలైనంత త్వరలో ఉపాధి యంత్రాలు అందించడం జరుగుతుందన్నారు.అదేవిధంగా నియోజకవర్గం ఆర్యవైశ్యులకు రాజకీయ చైతన్యం తీసుకుని వచ్చి ఓటు శాతాన్ని పెంచుకుంటామన్నారు.అన్ని రాజకీయ పార్టీల రాజకీయ నాయకులు ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. తల్లిదండ్రులని అనాధ ఆర్యవైశ్య విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందించడం జరుగుతుందన్నారు.అవసరమైతే వారి స్థితిగతులను బట్టి ఆర్థిక సహాయం అందించాలని కూడా జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  సంజీవరావు ప్రసాద్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు బొగ్గవరపు లక్ష్మీనారాయణ కార్యదర్శి పరుచూరి కుమార్ ,తలం సుమంత్ సభ్యులు పలుకూరి శ్రీనివాసులు. తదితరులు పాల్గొన్నారు.

About Author