PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖజానా ఖాళీ చేసిన ఘనుడు సీఎం జగన్

1 min read

సచివాలయ సిబ్బందితో ఇంటింటికి  వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి. 

నియోజకవర్గ టిడిపి అభ్యర్థి గిత్తా జయసూర్య.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీచేసి వృద్దులు, దివ్యాంగులు, వితంతు తదితరుల పెన్షన్ ఇవ్వకుండా టీడీపీ పై అవాస్థవ ప్రచారం చేయడం ఛిగ్గుచేటని నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య  అన్నారు. తక్షణమే పెన్షన్ పంపిణికి చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఓఆర్డీ సంజన్న కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా  గిత్త జయసూర్య  మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల  మేరకు వాలంటరీలు  పెన్షన్ పంపిణి చేయరాదని ఆదేసించిందన్నారు. వాలంటీర్లు కాకుండా సచివాలయ, ఎంపీడీఓ కార్యాలయ ప్రభుత్వ అధికారులచే పెన్షన్ పంపిణి చేయకుండా ప్రతిపక్షం టీడీపీ పై నిందలు వేసి చేతులు దులుపుకోవడం అన్యాయం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అని ప్రజలకు తెలుసని, మళ్ళీ జగన్ ప్రభుత్వం రాదని గృహించి వై సి పి కాంట్రాక్టులకు మాత్రమే బిల్లులు చెల్లించి పెన్షన్ పంపినికి నిధులు లేకుండా చేసారని ఆయన ఆరోపించారు. పెన్షన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13వేల కోట్ల రూపాయల నిధులు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన ఘనుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. పెన్షన్ నిధులను దారి మళ్లించి టిడిపి పార్టీపై నిందలు వేయడం విడ్డురంగా ఉందన్నారు. జిల్లా అధికారులు , ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్వంధించి   అర్హుల పెన్షన్ తక్షణమే ఇంటివద్ద అందించేలా చర్యలు తీసుకోవాలని  వినతి పత్రం ధ్వారా కోరారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి , పల్లె రఘు రామిరెడ్డి, లాయర్ జాకీర్, షకీల్ అహమ్మద్, నిమ్మకాయల మోహన్, నిమ్మకాయల రాజు, బొల్లెద్దుల  రాజన్న, సిరిగిరి కళాకార్, ప్రవీణ్ (రగడ) , మహిళా నాయకురాలు మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.

About Author