PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు ప్రోత్సాహం..

1 min read

వైసీపీ మండల యువజన అధ్యక్షుడు మాబుషరీఫ్

పల్లెవెలుగ వెబ్ చాగలమర్రి :చాగలమర్రి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర  పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు  వైయస్సార్ కాంగ్రెస్ చాగలమరి మండలం యువజన విభాగం అధ్యక్షులు , 16 వ వార్డు సభ్యులు షేక్ వలీసా  మాబు షరీఫ్ ప్రోత్సహిస్తున్నారు. గురువారం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో   నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలకు సంబంధించి సిక్సర్ కొట్టిన క్రీడాకారులకు ప్రతి బంతికి  రూ 200 బహుమతిగా ఆయన అందజేశారు. దీంతో ఇరుజట్లు పోటాపోటీగా  ఆడి 5 సిక్స్ లు   కొట్టి  రూ 1000 నగదు బహుమతిని గెలుచుకున్నారు . సిక్సర్లు కొట్టిన  క్రీడాకారులకు షరీఫ్  నగదు బహుమతి ఇచ్చి అభినందించారు.  ఎంపీడీవో మహబూబ్ దౌలా చేతుల మీదుగా ఈ బహుమతిని క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిడి ముల్లా దాదా పీర్, ఇన్చార్జి ఈవో నాగమణి , వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ముల్లా ఖాదర్బాషా, బబ్లు, బావద్దీన్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు .

About Author