PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రుల ఇళ్లల్లో కుక్క బిస్కెట్లకు కూడ‌ ఉద్యోగుల బ‌డ్జెట్ నుంచే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రభుత్వ ఉద్యోగుల‌కు పీఆర్సీ, క‌రువు భ‌త్యం బ‌కాయిల సంగ‌తి దేవుడెరుగు.. జీత‌మో రామ‌చంద్ర అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాస‌రావు ధ్వజ‌మెత్తారు. మంత్రుల ఇళ్లల్లో కుక్క బిస్కెట్లకు కూడ ఉద్యోగుల బ‌డ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తున్నార‌ని ఆరోపించారు. ఉద్యోగుల బ‌డ్జెట్ ను ఇత‌రుల అవ‌స‌రాల‌కు గ‌తంలో ఎన్నడూ కేటాయించిన సంద‌ర్బాలు లేవ‌ని చెప్పారు. వృద్దుల‌కు, దివ్యాంగుల‌కు త‌మ చేత్తో పింఛన్​ ఇప్పిస్తూ త‌మ‌కు జీతాల్లేకుండా చేయ‌డం దుర్మార్గమ‌ని అన్నారు. ప‌దో తేది వ‌చ్చినా జీతాలు, పింఛన్లు అంద‌నివారు ఉన్నార‌ని చెప్పారు. స‌చివాల‌యానికి వెళ్తే ఆర్థిక మంత్రి, అధికారులు క‌నిపించ‌డంలేద‌ని అస‌హ‌నం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ప‌ట్ల చిన్నచూపు చూస్తున్నట్టు తాము భావిస్తున్నామ‌ని తెలిపారు.

About Author