NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుగ్గన లెక్కలు చూసి చాణక్యుడు సైతం నివ్వెరపోతారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్న లెక్కలు చాణక్యుడు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి వ్యయం పై ఆయన చెప్పిన లెక్కలు.. తన కాళ్లకు తానే నమస్కారం చేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. పెట్టుబడి వ్యయం పెరిగిందంటున్న బుగ్గన.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంతెంత ఖర్చుపెట్టారన్నది చెప్పగలరా? అని సవాల్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రెండు రెట్లు అప్పులు తెచ్చారని విమర్శించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కేంద్రానికి ఒక లెక్క, బ్యాంకులకు ఒక లెక్క, అసెంబ్లీకి ఒక లెక్క, అప్పుల కోసం ఒక లెక్క.. ఇలా ఎక్కడ ఏ లెక్క కావాలంటే ఆ లెక్కలు ఇచ్చేస్తున్నారని ధ్వజమెత్తారు.

        

About Author