NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నా.. నా మాట విన‌లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ‘ఎన్టీఆర్‌ గారిని కాళ్లు పట్టుకుని అడుక్కున్నా నా మాట వినండని..! కానీ ఆయన వినలేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. 1995లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత సంక్షోభంలో ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ దిగిపోయి చంద్రబాబు గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ తనయుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ పేరుతో నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొన్న మాజీ సీఎం.. ఆనాటి అధికార మార్పిడి పరిణామాలపై స్పందించారు. టాక్‌ షో ప్రొమోను మంగళవారం విడుదల చేశారు. మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయమేది అని బాలకృష్ణ అడిగినప్పుడు.. 1995లో చోటు చేసుకున్న పరిణామాలేనని చంద్రబాబు బదులిచ్చారు.

                                                        

About Author