PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇల్లు లబ్ది

1 min read

– రెండవ రోజూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే -ఈరోజు కలమందలపాడులో గడప గడప
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని మాసపేట,ఉప్పలదడియ గ్రామాలలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగింది.బుధవారం సాయంత్రం 4:30 నిమిషాల నుంచి 7 గంటల వరకు ఈకార్యక్రమం కొనసాగింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన నగదు వివరాలు గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పథకాల పత్రాలను ప్రజలకు అందజేస్తూ వారితో ఆప్యాయంగా మంచి పలకరింపులతో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ముందుకు సాగారు.మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండని ఆయన ప్రజలతో అన్నారు. గ్రామంలో సిసి రోడ్లు మరియు త్రాగునీటి పైపులైన్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు.వాటికి సంబంధించిన ఆయా శాఖల అధికారులను పిలిచి వెంటనే వీటిని పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈరోజు గురువారం ఉదయం 9 గంటలకు కలమందలపాడులో గడప గడప కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంషున్ భీ,ఎంపీటీసీ కమతం జయమ్మ,వైసిపి నాయకులు చెరుకుచెర్ల రఘు రామయ్య,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,నాగటూరు సుధాకర్ రెడ్డి,వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,కమతం వీరారెడ్డి,కలవందలపాడు మహబూబ్ బాష,తిమ్మారెడ్డి, ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్, వివిధ శాఖల మండల అధికారులు పంచాయతీ కార్యదర్శి అశ్రఫ్ భాష,విఆర్ఓ రాఘవేంద్ర,వివిధ గ్రామాల నాయకులు ఇనాయతుల్ల,చంద్రశేఖర్ రెడ్డి,వెంకట్ తదితర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author