PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరూ రండి.. వైసీపీ ఈజ్ వెయిటింగ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : విశాఖ పర్యటనలో భాగంగా తనను అడ్డుకున్న తీరును ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన ఈజ్ వెయిటింగ్ అంటూ అధికార వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఆ మరుక్షణమే జనసేనకు వైసీపీ నుంచి అంతే స్థాయిలో వార్నింగ్ వచ్చింది. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులతో కలిసి రండి… వైసీపీ ఈజ్ వెయిటింగ్ అంటూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని బదులిచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనాని పవన్ తీరును ప్రశ్నిస్తూ పేర్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

About Author