NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి… టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడినవారమవుతామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్లోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి అభినందించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ అత్యవసరంగా బ్లడ్ కావాలంటూ సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎంతో మంది పోస్టులు పెడుతున్నారన్నారు. ఇలాంటి రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో రక్తం అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. బ్యాంకు ద్వారా సేవలు అందిస్తూనే ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author