PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తేదేపా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల పోరాటం చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: తేదేపా గెలుపు కోసం ప్రతి తేదేపా నాయకులు,కార్యకర్తలు సైనికుల పోరాటం చేయాలని డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మన్నె సుబ్బారెడ్డి అన్నారు.ఈసందర్భంగా శుక్రవారం  ప్యాపిలి మండల వెంగళంపల్లి గ్రామం  లో “”బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ””రచ్చబండ కార్యక్రమం  మాజీ  సర్పంచ్ జయశీల్లమ్మ అధ్వర్యంలో నిర్వహించారు. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మన్నె సుబ్బారెడ్డి, తేదేపా రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్  మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డ నిది క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం  పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

About Author