PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాజిక సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి : ఎంపీ డా.సంజీవ్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్​: సామాజిక  సేవలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కర్నూలు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​. సోమవారం “స్మైల్ ఇండియా ఫౌండేషన్”  ఆవిర్భావం సందర్భంగా కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్  సంస్థ సభ్యులతో కలసి ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేయాలని, సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, ఉపాధ్యక్షుడు అశోక్, కార్యవర్గ సభ్యులు రాజు, శివ, నరేష్, మహేష్, బాబు, సుధీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author