PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాల్సిందే.. : ఎస్సై వెంకటేశ్వర్లు

1 min read

పల్లెవెలుగు వెబ్, చిట్వేలు: ఒమిక్రాన్​ వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు ఎస్​ఐ వెంకటేశ్వర్లు. గురువారం చిట్వేలిలో కోవిడ్​ నిబంధనపై అవగాహన కల్పించారు.   నూతన సంవత్సర వేడుకలలో ఎవరు పాల్గొనకూడదని వారి వారి ఇళ్లలోనే ఉంటూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఎవరైనా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు రోడ్లపై తిరగ రాదని ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని తమకు ఆదేశించారని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని ఆయన అన్నారు . ఆదేశాలను పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కాటమయ్య తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author