PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ కు స‌ర్వం సిద్ధం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ ను నిర్ణయించే మ్యాచ్ కు సమయం ఆసన్నమయింది. ఇప్పటి వరకు ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో… నగరవాసులు మ్యాచ్ కు పోటెత్తబోతున్నారు. 55 వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియం పూర్తిగా నిండిపోనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతించనున్నారు. 5 గంటలకు ఆటగాళ్లు స్టేడియంకు చేరుకుంటారు.

                                       

About Author