PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుత్తాగెలుపుతో మొక్కులు తీర్చుకున్న- మాజీ అటవీ శాఖ డైరెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మండలం లోని రామనపల్లె కు చెందిన మాజీ అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో టిడిపి నాయకుల తో కలసి శుక్రవారం స్థానిక గ్రామ దేవత శ్రీ సీతాలమ్మ తల్లి, శ్రీ చౌడేశ్వరిదేవి  దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె టిడిపి నాయకుల కలసి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలందరికీ తెలియజేయడంతో, వారందరూ నారా చంద్రబాబు నాయుడు నమ్మి టిడిపి కి పట్టదు కట్టడం జరిగిందన్నారు, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గం లో పుత్త కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగిందని వారు తెలియజేశారు, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని అందుకే జనసేన, బిజెపి, టిడిపి కూటమిని ప్రజలు విశ్వసించారు కాబట్టే ఇంతటి అపారమైన మెజారిటీ ఇవ్వడం జరిగిందన్నారు, అనుభవజ్ఞులు, అపార పరిజ్ఞానం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన నేతృత్వంలో, అటు పోలవరం కానీ, ఇటు రాజధాని కానీ అన్ని విధాల రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు, భవిష్యత్తులో పుత్త కృష్ణ చైతన్య రెడ్డి, మరిన్ని పదవులు సాధించి కమలాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జి తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి( బుజ్జన్న), శివారెడ్డి, రామన మోహన్ రెడ్డి, దేవి రెడ్డి మాధవ రెడ్డి, ముండ్ల నరసింహారెడ్డి,పుత్తా మహేంద్ర రెడ్డి, ఎల్లారెడ్డి, తాడిగొట్ల సుబ్బారెడ్డి, బీసీ నాయకులు వేల్పుల సుబ్రహ్మణ్యం, మురళి, ఉప్పు నాగేంద్ర, భవాని ఆచారి, పోలిశెట్టి శివరామకృష్ణ, , ఎస్సీ నాయకులు నరసింహ,చిట్టి బాబు మహిళలు, టిడిపి కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author