PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ భూముల పరిశీలన..

1 min read

జెసి రాహుల్ కుమార్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల పరిధిలోని పై బోగుల గ్రామం వద్ద ఏర్పాటు చేయదలచిన సోలార్ పరిశ్రమపై శుక్రవారం నాడు నంద్యాల జిల్లా జెసి రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి ప్రభుత్వ భూములను పరిశీలించారు గ్రామ శివారులోని సుంకులమ్మ గుడి వద్ద అన్ సర్వుడ్ ప్రభుత్వ భూములు 973 ఎకరాల పైచిలుకు భూములను గుర్తించి సర్వే పూర్తి చేయడంతో క్షేత్రస్థాయిలో జేసీ ఆర్డీవో పరిశీలించారు ఈ సందర్భంగా మండల సర్వేయర్ శివప్రసాద్ డిటి గురునాథం స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూముల సమాచారాన్ని మ్యాప్ ని జెసికి వివరించారు పూర్తిస్థాయిలో సర్వే చేసి సిద్ధంగా ఉంచినట్ల తెలిపారు గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ సోలార్ పరిశ్రమ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మెరుగైన జీవన ప్రమాణం ఏర్పడుతుందని ఈ సందర్భంగా జెసి తెలిపారు.

About Author