NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పై పరీక్ష : ఎస్ఎఫ్ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హైస్కూల్) లో పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజ్ఞ వికాసం పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, ఇన్చార్జి హెచ్ఎం అయ్యస్వాము లు పాల్గొని విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పై అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న, మండల సహాయ కార్యదర్శి సలీం, పాఠశాల అధ్యాపక బృందం గుమ్మల బాబు, భాస్కర్, విజయ్ కుమార్, అమానుల్లా బేగ్, ఎస్ఎఫ్ఐ నాయకులు చిరంజీవి, మోహన్, చత్రపతి, అశోక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author