NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉదృతంగా న‌ది.. జేసీబీలో ఇరుక్కుపోయిన 10 మంది

1 min read

పల్లెవెలుగు వెబ్​ : అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నది లో 10 మంది చిక్కుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నది లో కారు గల్లంతు అయింది. అందులో నలుగురు వ్యక్తులను రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. మొత్తం 10 మంది జేసీబీ లోనే ఉండిపోయారు. తాళ్ల సాయంతో.. విద్యుత్ తీగల సాయంతో రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని మేల్యా చెరువుకు గండి పడింది. హిందూపురంలోని కొటిపి, పూలమతి, శ్రీకంఠపురం చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

About Author