PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీగిరిలో నంది వాహనం పై విహారం

1 min read

పల్లెవెలుగు వెబ్​: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి నంది వాహనం పై ఆ సీన్లు చేశారు కన్నడిగుల ఆడపడచు భ్రమరాంబాదేవి. మహా సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. అక్కమహాదేవి మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తు లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు .  ఉత్సవ. మూర్తులకు ఆలయ అర్చకులు వేదపండితులు మంగళహారతులు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, కళాకారుల సందడి నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లోకి తీసుకొచ్చారు. వేలాది మంది కన్నడ భక్తుల సందడి నడుమ గంగాధరమండపం నుంచి నందిమం డపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనుల పండు వగా కొనసాగింది. కన్నడ కళాకారుల వేషధారణలు ఆకట్టుకొన్నాయి. మ్యాస్టుడే శ్రీశైలం ఆలయం ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న ఆలయ ధర్మకర్తల సభ్యులు పాల్గొన్నారు.

About Author