PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి

1 min read

– ఆర్​ఏఎఫ్​ సహాయ దళాధిపతి ఎన్.వి.రావు
పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: ఈ నెల 16 న చాగలమర్రి పట్టణంలో 3 వ ఎంపీటీసీ స్థానానికి జరగనున్న ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవాలని రాపిడ్‌ యాక్షన్‌ పోర్స్‌ (ఆర్ ఎ ఎఫ్) సహాయ దళాధిపతి ఎన్.వి.రావు కోరారు. ఆదివారం చాగలమర్రి పట్టణంలో ఎన్నికలు జరగనున్న ప్రాంతంలో ఆర్‌ఏఎఫ్‌ సాయుధ బలగాలు కవాతు నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి పెద్దమకానం, గాంధీ సెంటర్‌,మైన్‌ బజార్‌,పాతబస్టాండ్‌,మల్లెవేముల బస్టాండ్‌,రిక్వెస్ట్‌ స్టాప్‌,చక్రపాణి హాల్‌ మీదుగా కవాతు నిర్వహించారు. కవాతులో ఇంచార్జ్‌ సిఐ కృష్ణయ్య,ఎస్‌ఐ మారుతి,హెచ్‌సిలు గోవిందరెడ్డి,శ్రీనివాసులు,సిబ్బంది పాల్గొన్నారు.

About Author