NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి అని మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ఆదివారం పిలుపునిచ్చారు. ఎన్నికల అధికారులు మరియు నంద్యాల ఎస్పీ, డిఎస్పి ఆదేశాల మేరకు  మండలంలోని బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలతో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరూ సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు బెదిరించడం ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే  ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని పరిష్కారం కాని వాటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లోని ప్రజలు సోదర భావంతో ఉండాలని ఎన్నికల సందర్భంగా కక్షలకు కార్పాన్యాలకు పోవద్దని సూచించారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను కేంద్ర బలగాలు అండగా ఉంటాయన్నారు ఈ కవాతులో కానిస్టేబుల్ చంద్రశేఖర్ మరియు పలువురు బి ఎస్ ఎఫ్ ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

About Author