NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈట‌లదే పై చేయి.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా !

1 min read

పల్లెవెలుగు వెబ్​: హుజురాబాద్ ఉపఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ ను విజ‌యం వ‌రించ‌నుంద‌ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఆరు సంస్థల్లో .. ఐదు సంస్థలు బీజేపీదే హవా అని స్పష్టం చేశాయి. బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య 7-10 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు అంచనా వేశాయి. మరో సంస్థ మాత్రం టీఆర్‌ఎస్‌ పైచేయి సాధించనున్నట్లు పేర్కొంది. ఈ ఉప ఎన్నికలో కీలక నేతగా ఈటల ఇమేజ్‌ పనిచేసిందని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి రూపంలో కాకుండా ఆయనను చూసే ఓటు వేసినట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో గత శాసనభ్యుడిగా ప్రజల తో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రజలకు సేవాభావంతో సహకరించడం వంటి అంశాలతో పాటు మంత్రివర్గం నుంచి తొలగించిన సానుభూతి పనిచేసిందని భావిస్తున్నారు. ప్రధానంగా ఈటలకు నిరుద్యోగులు, యువత అండగా నిలచినట్లు చెబుతున్నారు. దీంతో ఈట‌ల‌దే పైచేయి అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే.. ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు విజేత ఎవ‌రో వేచి చూడాల్సిందే.

About Author