NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసుల విస్తృత దాడులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు :కర్నూలు జిల్లా వెలుగుడు పట్టణంతోపాటు గ్రామాల్లోనూ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. దాడులో మద్యం, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో ని సి.పి.నగర్ కి చెందిన పీటల జంబులమ్మ అనే మహిళ తెలంగాణ మద్యం అమ్ముతుండగా ఆమెను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. ఆమె వద్ద నుంచి క్వార్టర్స్ బాటిళ్లు 9 , 8 (365 ఎంఎల్​) బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ద్వారకానగర్ కు చెందిన సయ్యద్ కరిముల్లా షాపులో గుట్కాలు అమ్మతుండగా , అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వీటి విలువ రూ.5 ,100 ఉంటుంది. వేల్పనూరు కు చెందిన వెంకటేశ్వర్లు ఆచారి అనే వ్యక్తి నుంచి 192 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని , అరెస్ట్ చేసి , రిమాండ్ కు పంపినట్లు ఏ.ఎస్.ఐ షేక్ షా వలి , నాయక్ , నాగన్న , తదితరులు పాల్గొన్నారు.

About Author