NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసిపి ప్రభుత్వం చేపట్టిన అరాచకాలను వైఫల్యాలను ఎండగడ్తతాం : కోట్ల

1 min read

పల్లెవెలుగు వెబ్​ ప్యాపిలి: వైసిపి ప్రభుత్వం చేపట్టిన అరాచకాలను వైఫల్యాలను ఎండగట్టుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెదేపా ప్రభుత్వం రావాలి అని డోన్ ఉమ్మడి టిడిపి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు.ప్యాపిలి మండలంలోని మాన్ దొడ్డి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి  గ్రామమునకు చేరుకొని వీధు లలో తిరుగుతూ వైసిపి ప్రభుత్వం చేపట్టిన అరాచకాలను వైఫల్యాలను ఎండగట్టుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే రైతు సమస్యలను ఆదుకోవాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను ఆదుకోవాలంటే సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు ఎంపీగా డాక్టర్ శబరి గారికి మరొక ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, భాజపా, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author