NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నిస్తే త‌ప్పుడు కేసులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి పై మాజీ మంత్రి అఖిల ప్రియ మండిప‌డ్డారు. ప్రజల తరపున తాము ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. పట్టణంలో ఆమె మాట్లాడారు. ఆళ్ళగడ్డలో ఏటువంటి అనుమతులు లేకుండా నష్టం పరిహారం ఇవ్వకుండా రోడ్లు వెడల్పు చేస్తామంటె ప్రజలు ఒప్పుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు. ఆళ్ళగడ్డలో గతంలో ఉన్న రౌడీఇజాన్ని స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే తప్పు చెయ్యనప్పుడు కలెక్టరును కలిసి ఎంక్వయిరీ కమిషన్ వేయాలని ఎందుకు అడగలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలందరు ఏకమై ప్రశ్నించకుంటే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.

                                

About Author