NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిజి వెంకటేష్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ బంజారాహిల్స్ వంద కోట్ల ల్యాండ్ వివాదంలో తన తండ్రి, ఎంపీ టిజి వెంకటేష్ ను కావాలనే తెరమీదకు తీసుకొస్తున్నారని ఆయన కుమారుడు, కర్నూల్ టిడిపి ఇంచార్జి టిజి భరత్  ఆరోపించారు. సదరు ల్యాండ్ విషయంలో కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారని తెలిపారు. టిజి వెంకటేష్ కు సంబంధం లేదని, ఆయన పేరును అన్ని రికార్డుల నుండి తొలగించాలని కూడా పోలీసులకు లెటర్ రాసి ఇచ్చారని భరత్ చెప్పారు. ఈ వివాదానికి తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తమకు తెలియని విషయంలోకి కావాలని ఇరికించాలని చూడటం మంచిది కాదన్నారు.

About Author