NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:  మండల పరిధిలోని కలమందలపాడు గ్రామంలో గురువారం మహమ్మద్ రఫి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రఫి కుటుంబం చాలా పేదరిక కుటుంబమని ముగ్గురు కూతుర్లు ఉన్నారని భార్య అంగన్వాడి టీచర్ గా పని చేస్తూ కుటుంబ పోషణ గడుపుతున్నారని  కౌలుకు పొలం  తీసుకొని రైతు అప్పుల పాలు అయ్యాడని వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడని వారన్నారు.తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని 50 లక్షల ఎక్స్ గ్రేసీయో చెల్లించి రైతు కుటుంబానికి భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన లో ఉన్నారని వారి ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author