PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో ఫ్యాన్​..హవా..

1 min read

ఎమ్మెల్యే ఏంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి సహకారంతో గెలుపు ధీమా…

  • ఇంటింటికి వెళ్లి.. విస్తృత ప్రచారం..
  • నగరాభివృద్ధికి కృషి చేస్తా…
  • ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా…
  • సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా…
  • కలెక్టర్​గా సేవ చేశా….
  • ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి…
  • వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ అహ్మద్​

సార్వత్రిక ఎన్నికల కోడ్​ నేడో…రేపో..రానున్న నేపథ్యంలో టీడీపీ.. వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్​ మొదలైంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త వారికి  టిక్కెట్​ ఖరారు చేయగా… మరికొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. టిక్కెట్​ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు, టిక్కెట్​ వచ్చినా తక్కువ సమయం ఉందని అభ్యర్థులు టెన్షన్​ పడుతున్నారు. ఈ కోవకు చెందిన వారిలో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ అహ్మద్​ కూడా ఉన్నారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి సహకారంతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పల్లెవెలుగు, కర్నూలు:కర్నూలు నగరంలో ఫ్యాన్​ హవా కొనసాగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంతోపాటు నగరాన్ని  స్మార్ట్​సిటీగా తీర్చిదిద్దుతానని స్పష్టమైన హామీ ఇస్తున్న వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ అహ్మద్​ ప్రచారంలో జోరందుకున్నారు. ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి సహకారంతో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

జోష్​..ఫుల్​…:

విద్యావంతుడు..మేధావి…కలెక్టర్​గా బాధ్యతలు నిర్వర్తించిన ఇంతియాజ్​ అహ్మద్​.. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరుతున్నాడు. ఇప్పటికే నగరంలోని కొన్ని వార్డుల్లో పర్యటించిన ఆయనకు.. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో కార్యకర్తలు, నాయకులు జోష్​లో ఉన్నారు.

సేవ కోసమే… వచ్చా…:

నగరవాసులకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొంటున్న ఇంతియాజ్​ అహ్మద్​… అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, ఇది గుర్తించుకొని ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తానని… సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు.

వారిపైనే… నమ్మకం….:

సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి తనపై నమ్మకంతో …కర్నూలు అభ్యర్థిగా నిలబెట్టారని పేర్కొన్న ఇంతియాజ్​ అహ్మద్​… తనను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి అప్పగించారని స్పష్టం చేశారు.  ఇప్పటికే వారిద్దరితో కలిసి ప్రతి సమావేశంలోనూ.. కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ… విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ముస్లిం ఓట్లే… కీలకం..:

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన కర్నూలులో అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ధారించడంలో ముస్లింల పాత్ర కీలకం.  కానీ తనను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని, ఇందుకు ప్రచారంలో వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. ఏ వార్డుకు వెళ్లినా… సీఎం వై ఎస్​ జగనన్న మనిషి వచ్చాడంటూ… ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం జగన్​కు… గిఫ్ట్​..:

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వైసీపీ జెండా ఎగరవేసి… సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి గిఫ్ట్​గా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ అహ్మద్​. ప్రభుత్వ పథకాలు అందకపోయినా…. ఏమైనా సమస్యలు ఉన్నా  తనను ఎప్పడైనా సంప్రదించవచ్చని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.  వైసీపీ నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్న కర్నూలులో తాను సునాయాసంగా గెలుపొందుతానని ఇంతియాజ్​ అహ్మద్​ చెప్పుకొచ్చారు.

About Author